ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉన్న ఒక అందమైన జిల్లా. ఉత్తరాఖండ్ జిల్లా 24 ఫిబ్రవరి,1960 న స్థాపించబడింది. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్ మరియు టిబెట్ ఉంటాయి. ఈ ప్రదేశం హిందువులకు ఎంతో మతసంబంధ ప్రాముఖ్యత కలిగి ఉంది, మరియు 'నార్త్ కాశీ' అదే విధంగా 'టెంపుల్స్ టౌన్' అని పిలువబడుతుంది.
ఉత్తరకాశి యొక్క పవిత్ర పట్టణం గంగా నది ఒడ్డున ఉంది, మరియు రుషికేష్ నుండి 172 కి.మీ. దూరంలో ఉంది. ఈ ప్రదేశం ప్రసిద్ధి మత సంబంధమైన ప్రాంతాలకు, గంగోత్రి మరియు యమునోత్రికి చేరువలో ఉంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర కురుస్,ఖసస్,కిరతాస్,కునిన్దాస్,తంగనస్ మరియు ప్రతంగనస్ తెగలకు చెందినవారు నివసించేవారు.
ఉత్తరకాశిలో అందమైన ఆలయాలు మరియు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర ప్రదేశంను సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో ప్రసిద్ధ ఆలయాలు విశ్వనాథ్ ఆలయం, పోఖు దేవతా ఆలయం, భైరవుని ఆలయం, కుట్టి దేవి ఆలయం, కర్ణ దేవతా ఆలయం,గంగోత్రి ఆలయం,యమునోత్రి ఆలయం మరియు శని దేవాలయం ఉన్నాయి.
హిందూ మతదేవుడైన శివునికి అంకితమైన విశ్వనాథ్ ఆలయం, పర్యాటకులు నడుమ చాలా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రసిద్ధ ఆలయం ఉత్తరకాశికి 300 మీ. దూరంలో స్థానిక బస్సు స్టాండ్ ఉంది. మణికర్ణిక ఘాట్ ప్రాంతం మరొక ముఖ్యమైన మత సంబంధ కేంద్రంగా ఉంది.ఒక పురాణం ప్రకారం, ఉత్తరకాశి పట్టణం గొప్ప ఋషి జడా భారతమాత పశ్చాత్తప్తుడు అయిన ప్రదేశం. ఈ ప్రదేశం గురించి హిందూ మత పుస్తకం స్కంధ పురాణంలో కేదార్ ఖండ్ లో వివరించబడింది.
గంగోత్రి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందనవన్ తపోవన్,శివ లింగ వంటి వివిధ పర్వత శిఖరాలు,తలే సాగర్, భాగీరథి, కేదర్ గోపురం, మరియు సుదర్శన అందమైన దృశ్యాలను అందిస్తుంది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఉత్తరకాశి-గంగోత్రి రోడ్లో నెలకొని ఉన్న దయార బుగ్యల్ ను సందర్శిస్తారు. ఈ స్థలం 3048 మీటర్ల ఎత్తులో ఉండి స్కీయింగ్ కు ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది.
హర్ కి డూన్ సముద్ర మట్టానికి 3506 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రముఖ ట్రెక్కింగ్ ప్రాంతము. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అనేక అతిథి గృహాలు మరియు బంగాళాలు పర్యాటకులు ఉండడానికి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. విశ్వనాథ్ ఆలయం ఎదురుగా ఉన్న శక్తి ఆలయం, ఇక్కడ ఒక ప్రముఖ మత ప్రదేశంగా ఉంది. ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి 26 అడుగులు అధిక త్రిశూల్ (త్రిశూలము) ఉంది.
ఉత్తరకాశిలో దోదితల్, సముద్ర మట్టానికి 3307 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక అందమైన సరస్సు . ఈ స్థలంను సదర్సించే ఆసక్తి గల యాత్రికులు రోడ్ లేదా ట్రెక్కింగ్ మార్గాల ద్వారా ఇక్కడకు చేరవచ్చు. ఈ స్థలం కూడా యమునోత్రి మరియు హనుమాన్ చత్తి ట్రెక్కింగ్ కొరకు స్థావరంగా పనిచేస్తుంది.
వీటితో పాటు, మనేరి అనే కొత్తగా అభివృద్ధి చేసిన పర్యాటక ప్రదేశం. ఇది ఉత్తరకాశి నుండి 2 కి.మీ. దూరంలో ఉంది. సమయం అనుకూలిస్తే ప్రయాణికులు 1965 వ సంవత్సరంలో స్థాపించబడిన మౌంటెనీరింగ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ను సందర్శించండి. ఈ ఇన్స్టిట్యూట్ కు, పర్వతాలు అంటే చాలా ఇష్టం అయిన భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు. అవే కాక గంగ్నని,సత్తల్,దివ్య శైలి, మరియు సూర్య కుండ్ ప్రాంతంలోని ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
ఉత్తరకాశికి సమీపంలోని విమానాశ్రయం 160 కి.మీ. దూరంలో డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం ఉంది. రుషికేష్ రైల్వే స్టేషన్ గమ్యానికి సన్నిహిత రైలు లింక్. యాత్రికులు డెహ్రాడూన్, హరిద్వార్, రుషికేష్, మరియు మసూరీ వంటి సమీపంలోని నగరాలు నుండి ఉత్తరకాశికి బస్సులు లభిస్తాయి.
ఉత్తరకాశిలో ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు సంవత్సరము పొడవునా ఉంటాయి. అయితే, వేసవి మరియు వర్షాకాలంలలో వివిధ పండుగలు జరుపుకుంటారు. ఆ సమయంలో ఈ పవిత్ర ప్రదేశంను సందర్శించడానికి సిఫారసు చేయవచ్చు.