సంవత్సరానికి ఒక్కసారి మకర సంక్రాంతి నాడు శబరిమల లో వైభవంగా జరిపే అతి పెద్ద పండుగ 'మకరవిళక్కు'. సుమారు అయిదు లక్షల మంది యాత్రికులు ఈ పండుగ సమయంలో శబరిమలకి తరలి వస్తారు. మకరవిలక్కు పండుగని జనవరి పద్నాలుగవ తేదిన జరుపుకుంటారు. ఈ గుడిలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహాన్ని, ఈ శుభప్రదమైన రోజున రాజరికపు రత్నాలతో అందంగా అలంకరిస్తారు.
ఈ పండుగని తిరువాభరణం(ఆభరణాల) ఊరేగింపు తో ప్రారంభిస్తారు. పండలం ప్రాంతం నుండి ఆభరణాలను తెప్పిస్తారు. ఈ భారీ ఊరేగింపు ని చూడడానికి ప్రతి సంవత్సరం ఏంతో మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఊరేగింపు ఉత్సవం భక్తుల ఆనందాల మధ్య ప్రధాన గుడికి చేరుకుంటుంది. ఈ ఏడు రోజుల ప్రధాన పండుగ వన దేవతలు మరియు దేవుళ్ళని శాంతపరిచే 'గురుతి' అనబడే ఆచారంతో ముగుస్తుంది.
ఈ రోజు శుభప్రదమైన ధ్రువ నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది. ఇంద్రియాలకు ఆధ్యాత్మిక తృప్తి ని కలిగించి పరిశుద్ధి కలిగిన మనస్సు, ఆత్మ మరియు శరీరం తో ఇంటికి వెళ్ళడానికి ఈ మకరవిలక్కు దోహదపడుతుందని నమ్మకం.