స్వామి అయ్యప్పని ఆరాధించే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శబరిమల లో ఉన్న అయ్యప్ప గుడి. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. ఈ ప్రాంతంలో భక్తులు ఆధ్యాత్మికానందం, సంతృప్తి, శ్రేయస్సువంటివి ప్రసాదించమని కోరుకుంటారు. ఇక్కడ నవంబర్ నెలలో ప్రారంభమయ్యే యాత్రా కాలం జనవరి చివరి వరకూ కొనసాగుతుంది.
ఈ సమయంలో జరిగే అయ్యప్ప స్వామి ప్రార్ధనలతో చుట్టూ ఉన్న కొండలన్నీ ప్రతిధ్వనిస్తాయి. గర్భగుడికి చేరేందుకు భక్తులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని నమ్మకం. మలికప్పురం దేవి కి అయ్యప్ప స్వామి గుడి కి పక్కనే ఒక గుడి అంకితమివ్వబడింది.
ఈ గుడి పర్యాటకులకి అద్భుతమైన సౌందర్యాలని, వెస్ట్రన్ ఘాట్స్ అందాలని పరిచయం చేసి మంత్రముగ్ధులని చేస్తుంది.