ఘుగ్ఘ వీర్ ను ఘుగ్ఘాల్ లేదా జహార్ దీవాన్ గుగ్ఘా పీర్ అని కూడా అంటారు . ఇది సహారా పూర్ కు 5 కి. మీ.ల దూరంలో కలదు. నౌగాజా పీర్ వలెనె ఇది కూడా అనేక మంది ముస్లిం, హిందూ పర్యాటకులను ఆకర్షిస్తుంది. పురాణాల మేరకు రాజు పటాన్ కు ఇద్దరు కుమార్తెలు అని వారి పేర్లు వచ్చల్ మరియు కచాల్ గా చెపుతారు. వివాహం తర్వాత వచ్చాల్ పుత్రుడి కొరకు గురు గోరఖ్నాత్ ను పూజించినది. అయితే ఆశీర్వాద సమయం లో ఆమె సోదరి కచ్చాల్ మధ్యలో రాగా ఆశీర్వాద ప్రభావంతో ఆమెకు ఇద్దరు పుత్రులు కలిగారు.
విషయం తెలుసుకున్న గురూజీ మరొక మారు ఆమెకు పుత్రుడు పుడతాడని అయితే, కచ్చాల్ కు జన్మించిన ఇరువురు పుత్రులను ఘుగ్ఘాల్ మరణింప చేయాలని ఆశీర్వదిస్తాడు. ఘుగ్గాల్ పెరిగి తపస్సు చేసి ఈ షరతు నిర్వీర్యం అవాలని కోరతాడు. అతను తపస్సు చేసిన ప్రదేశాన్ని గుగ్ఘాల్ వీర్ కి మరి అంటారు. ప్రతి సంవత్సరం ఈ సంఘటనకు ఒక ఉత్సవం శుక్ల పక్ష దశమి అంటూ చేస్తారు.