బులంద్షహర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్షహర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. అంతేకాకుండా పరిపాలక రాజధానిగా కూడా ఉంది. ఈ ప్రాంతంలో మహాభారతం కాలంనాటి వారసత్వ మూలాలను కనుగోన్నారు. ఇక్కడ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో దొరికిన పురాతన నాణేలు మరియు కళాఖండాలు ప్రస్తుతం లక్నో మ్యూజియంలో సంరక్షింపబడుతున్నాయి.
బులంద్షహర్ బులంద్షహర్ జిల్లా చరిత్ర 1200 క్రీస్తుపూర్వంనకు చాలా ముందు ప్రారంభమైనది. ఈ ప్రాంతం పాండవుల రాజధాని హస్తినాపూర్ కు సమీపంలో ఉన్నది. హస్తినాపూర్ పతనం తర్వాత ఈశాన్య భాగంలో ఉన్న ఆహార్ అనే పేరు గల మరొక ప్రదేశం బులంద్షహర్ జిల్లాలో సెంటర్ స్టేజ్ పొందినది.
చాలా కాలం తరువాత రాజు పర్మ ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఒక కోట కట్టించెను. ఆ తర్వాత కాలంలో ఒక తోమర్ రాజు బార్న్ అనే మరొక కోట శంకుస్థాపన మరియు తన రాజధానిగా ఏర్పాటు చేసుకొనెను. బార్న్ రాజ్యం 12 వ శతాబ్దంలో ముగింపుకు చేరుకుంది. 1192 లో మొఘల్ విజేత ముహమ్మద్ ఘురి బార్న్ యొక్క కోటతో సహా భారతదేశం యొక్క అనేక ప్రదేశాలను స్వాధీనం చేసుకొనెను. బార్న్ నగరం అనేక చేతులు మారింది మరియు చివరకు బులంద్షహర్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. బులంద్షహర్ పదంకు పెర్షియన్ మూలాలు మరియు 'హై సిటీ' అని అర్దము.
బులంద్షహర్ మరియు చుట్టూ ఉన్న పర్యాటక స్థలాలు
పైన చెప్పిన విధంగా, బులంద్షహర్ చరిత్ర ప్రాచీన కాలంనకు తీసుకు వెళ్తుంది. జిల్లాలో భాతోర వీర్పూర్ మరియు ఘలిబ్పూర్ వంటి ప్రదేశాల్లో అనేక శిధిలాలను కనుకున్నారు. చోళ, ఆహార్ మరియు వలిపుర వంటి కొన్ని ప్రదేశాలు ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. చోళ అనే చిన్న గ్రామం బిబ్కల్ చోళ పోలియో టీకామందు ఫ్యాక్టరీకి ప్రసిద్ధి చెందినది. కర్నవాస్ అనే గ్రామం గొప్ప చారిత్రక ప్రాధాన్యత కలిగి మరియు మహాభారతం గొప్ప నాయకుడు అయిన కర్ణుడు పేరు పెట్టబడింది. వలిపుర ఒక నది ఒడ్డున ఉన్న ఒక చిన్న అందమైన గ్రామం మరియు ఇక్కడ వాన్ చేతనా కేంద్ర సెంటర్ ఉంది.
సికంద్రబాద్ లో సికందర్ లోధీ నిర్మించిన అనేక పురాతన స్మారక కట్టడాలు ఉన్నాయి. పర్యాటకులు ఇతర నగరాలు మరియు పట్టణాలు, బులంద్షహర్ దేవాలయాలు మరియు బెలోన్ ఆలయంతో సహా అనేక మత సంబంధమైన స్మారక భవంతులను చూడవచ్చు.
బులంద్షహర్ చేరుకోవడం ఎలారైలు మార్గం,రోడ్డు మార్గం ద్వారా బులంద్షహర్ ను చేరుకోవచ్చు.
బులంద్షహర్ సందర్శించడానికి ఉత్తమ సమయంబులంద్షహర్ సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ మరియు ఏప్రిల్ మధ్య ఉంటుంది.