సంగ్లీలో గణపతి మందిరం ప్రసిద్ధి. ఈ దేవాలయాన్ని 1811 నుండి 1844 సంవత్సరం వరకు సుమారు 30 సంవత్సరాలపాటు నిర్మాణం చేశారు. నిర్మాణం అప్పాసాహెబ్ పట్వర్ధన్ అనబడే సంగ్లీ రాజా సాహెబ్ చేశారు. ఈ దేవాలయాన్ని మన స్వాతంత్ర పోరాట సమయంలో ఉద్యమానికి గాను పేరు గాంచిన పోరాట యోధులు మహాత్మ గాంధీ మరియు లోకమాన్య తిలక్ వంటి వారు ఉపయోగించారు. ఈ దేవాలయం అద్భుత అందాలతో ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో నల్లని రాతి గోడలు, అతి పెద్ద చెక్క ద్వార బంధాలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయం సుమారు 2 ఎకరాల ప్రదేశంలో విస్తరించి ఉంటుంది.