భీమ్ ఘర్ సంజయ్ సరోవర్ డ్యాం సియోనీ జిల్లా నుంచి 43 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ సుప్రసిద్ధ డ్యాం చాప్రా లోని వెయిన్ గంగా నది మీద వుంది. ఈ డ్యాం ఆసియా లోని అతి పెద్ద మట్టి డ్యాం గా ప్రసిద్ది పొందింది. ఈ మట్టి డ్యాం ను నిర్మించాక వ్యవసాయం చాలా వరకు విస్తరించింది.
సియోనీ లోని ఈ సుప్రసిద్ధ ఆకర్షణ ఇప్పుడు అభివృద్ది జరుగుతున్న దశలోనే వుంది, దీన్ని ఒక విహార కేంద్రంగా కూడా తీర్చి దిద్దాలన్నది లక్ష్యం. ఈ ప్రదేశంలో బోటింగ్ సౌకర్యం కూడా వుండడం వల్ల ప్రయాణీకులు బోటింగ్ చేసి కొన్ని ఆనంద క్షణాలను ఇక్కడ గడపవచ్చు. పైగా, ఇక్కడి ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతం అందాన్ని ఇనుమడింప చేస్తుంది.
చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో భీమ్ ఘర్ సంజయ్ సరోవర్ డ్యాం నిర్మించారు. ఈ మధ్యే ఈ డ్యాం విద్యుత్ ఉత్పత్తి చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు అందిస్తోంది.



Click it and Unblock the Notifications