ఖతుశ్యామ్ జీ గ్రామంలో ఉన్న ఖతుశ్యాం జి ఆలయం, సికార్ నుండి 97 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెల్లని పాలరాయితో నిర్మించిన కృష్ణునికి చెందినా ఈ పురాతన ఆలయానికి సంబంధించి ఆసక్తికర అనేక పురాణ గాధలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రస్తావన గొప్ప కావ్యం ‘మహాభారతం’ లో ఉంది. హిందువులు ఈ దేవాలయంలో ఉన్న సరస్సులో మునకవేయడం పవిత్రంగా పరిగణిస్తారు. ఈ ఆలయం లోని శ్యామ్ తోట సుందర దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ఫిబ్రవరి, మార్చ్ నెలలలో జరిగే ఖతుశ్యామ్ జీ ఉత్సవానికి ఈ దేవాలయం ప్రసిద్ది చెందింది. ఈ ఉత్సవం ఇక్కడి వివిధ జానపద నృత్యాలను, సంగీతం, కళా రూపాలను ప్రదర్శిస్తుంది. భారత పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ దశమి, ద్వాదశి మధ్య మూడు రోజుల వార్షిక ఉత్సవం జరుగుతుంది.