రాజస్ధాన్ లోని షెఖావతి ప్రాంతంలో పిలాని ఒక చిన్న పట్టణం . ఈ పట్టణం అనేక ప్రముఖ విద్యా సంస్ధలకు ప్రసిద్ధి. అన్నింటిలోకి ప్రధానమైన సంస్ధ బిట్స్ పిలాని. ఈ పట్టణం ఢిల్లీకి సుమారు 203 కి.మీ. ల దూరంలో ను మరియు రాజస్ధాన్ రాజధాని జైపూర్ కు 205 కి.మీ.ల దూరంలోను కలదు. ఈ పట్టణం రాజస్ధాన్ లోని ఝంఝును జిల్లా పాలనలోకి వస్తుంది.
ఇక్కడి నివాసితుల మేరకు పట్టణానికి ఈ పేరు పిలానియా గోత్ర కు చెందిన ప్రఖ్యాత జాట్ యోధుని కారణంగా వచ్చింది. ఈ యోధుడు పట్టణంలోని కోటను సంరక్షించేందుకుగాను శత్రువులతో పోరాడి తన ప్రాణాలను అర్పించాడు. ఆ యోధుని ప్రాణ త్యాగానికి గాను అప్పటి పాలకులు పట్టణానికి అతని పేరు పెట్టారు.
ప్రస్తుతం, ఈ చిన్న పట్టణం అనేక ప్రముఖ విద్యా సంస్ధలు కలిగి ఉంది. బిట్స్ పిలాని దేశంలోని ఇంజనీరింగ్ కోర్సులలో ఉత్తమమైనవి అందిస్తుంది. అనేక మంది నిపుణులైన వారిని గత యాభై ఏళ్ళలో తయారు చేసింది. పిలాని లో మరి కొన్ని ప్రసిద్ధ విద్యా సంస్ధలు అంటే, బి.కె. బిర్లా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (బికెబిఐఇటి), ది జిడి బిర్లా మెమోరియల్ పాలీటెక్నిక్ ఇన్ స్టిట్యూట్ (బిటి టిఐ మరియు షాదిలాల్ కటారియా టీచర్ ట్రైనింగ్ కాలేజీ. ఈ పట్టణం ధార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెంది ఇండియాలోని ప్రధాన పారిశ్రామిక దారులలో ఒక కుటుంబమైన బిర్లాల స్వంత పట్టణం
చిన్న పట్టణం అయిన కారణంగా పిలాని కి విమానాశ్రయం లేదా రైలు స్టేషన్ లు లేవు. సమీప రైలు స్టేషన్ చిరవా రైలు స్టేషన్ ఇది. పిలానికి 17 కి.మీ.ల దూరంలో కలదు. పర్యాటకులు ఈ పట్టణాన్ని డిసెంబర్ మరియు జనవరిలో సందర్శించటం మంచిది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.