భువన మహాదేవ టెంపుల్ ఉన్న భువన కొండకు అయిదు కిలోమీటర్ల దూరం లో ఈ టన్నెల్ ను చూడవచ్చు. మహాభారత ఇతిహాసం లో ఈ ప్రదేశం గురించి ప్రస్తావించబడింది. భగవంతుడు శ్రీ కృష్ణుడు ఈ సొరంగ మార్గాన్ని వాడారని భావిస్తారు. పవిత్ర త్రివేణి నది ఈ సొరంగం కింద నుండి ప్రవహిస్తుంది. ఈ సొరంగానికి సమీపాన శ్రీ కృష్ణుని మందిరం ఉన్నది. ప్రపంచం నలుమూలల నుండి ఈ ప్రదేశానికి సందర్శించడానికి పర్యాటకులు తరలి వస్తారు.
సిల్చార్ ని సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు. ప్రతి యేటా హోలీ మరియు శివరాత్రి పండుగలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి.