సిల్చార్ కి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరం లో ఉన్న భుబాన్ మహాదేవ టెంపుల్ మధ్య యుగ కాలం లో నిర్మించబడినది గా భావిస్తారు. ఈ ఆలయం మహా శివుడికి అంకితమివ్వబడినది. భువన కొండల పైన ఉన్న ఈ ఆలయం కచారి రాజు లక్ష్మీ చంద్ర చేత నిర్మించబడినది. ఈ ఆలయం లో మహా శివుడు, పార్వతి దేవి విగ్రహాలు దృఢమైన రాయితో తయారుచేసినవి ఉన్నాయి.
ఈ ఆలయం లోని కళా పనితనం అత్యత్తమ కచారి నిర్మాణ శైలి కి అద్దం పడుతుంది . శివరాత్రి సమయాన దేశం నలుమూలల నుండి భక్తులు ఈ దేవాలయాని సందర్శిస్తారు. కొండ కిందనుండి గుడివరకు ఈ పవిత్ర మర్గాన జరిగే నడక ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది . ఈ కొండ పైనుండి పక్కని లోయ ను చూడటం కళ్ళకు ఒక వేడుక .