'శాశ్వత పుణ్యక్షేత్రం' అని పిలువబడే సోమనాథ్ మహాదేవ్ ఆలయం, గుజరాత్ లోని సోమనాథ్ వద్ద ఉంది. ఆలయం ఏడు సార్లు నాశనం కాబడి, పునర్నిర్మించబడింది. ఇది చంద్ర దేవుడు “సోమ” ద్వారా బంగారంతో, సూర్యు దేవుడు “రవి” ద్వారా వెండి తో, కృష్ణ భగవానుడు ద్వారా కలపతో మరియు 11 వ శతాబ్దంలో సోలంకి రాజపుత్రుల ద్వారా రాయితో నిర్మించబడింది.
చివరి పునర్నిర్మాణం 1951 లో జరిగింది. ఆలయ సంపద మరియు కీర్తి అనేక సార్లు దాడికి దారితీసింది. ఈ ఆలయం దాని అద్భుతమైన చెక్కడం, వెండి తలుపులు, నంది విగ్రహం మరియు దాని కేంద్ర శివలింగానికి ప్రసిద్ధి చెందింది. సందర్శకులు కార్తీక పూర్ణిమ పండుగ సమయంలో ఈ ఆలయాన్ని విశేషంగా సందర్శిస్తారు. ఈ ఉత్సవం, హిందూ మత పంచాంగం ప్రకారం కార్తీక శుద్ధ చతుర్దశి రోజున మొదలయి నాలుగు రోజుల పాటూ కొనసాగుతుంది.



Click it and Unblock the Notifications