ఇందిరా గాంధీ తులిప్ ఉద్యానవనం శ్రీనగర్ నగరం నుండి సుమారు 8 కిమీ దూరం లో ఉంది. ఇది దాల్ సరస్సు ఒడ్డున జబార్వాన్ పర్వత శిఖరాలలో ఉంది. సంవత్సరానికి ఒక సారి జరిగే 7 రోజుల తులిప్ ఉత్సవాలకి ఇది పేరు గాంచింది. ఈ తోట వివిధ రంగుల 70 రకాల తులిప్లకు ఆవాసం. దీన్ని శ్రీనగర్ లోని అనేకానేక ఉద్యానవనాలలో ఒకటి గా లెక్కిస్తారు.
ఇది సుమారు 90 ఎకరాల మేర విస్తరించి ఉంది. తోట పుష్పించే ఋతువులో ఒకే సమయంలో కనీసం 13 లక్షల తులిప్ మొగ్గలు ఉంటాయి. ఇది షాలిమార్ ఉద్యానవనం, చషం-ఎ-షాహీ ఉద్యానవనాలు, నిషాత్ ఉద్యానవనం, మరియు అనేక ఇతర మొఘల్ ఉద్యానవనాలకు దగ్గరలోనే ఉంది. ఈ ఉద్యానవన ప్రవేశ రుసుము పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు.



Click it and Unblock the Notifications