శ్రీనగర్ యొక్క ఖాన్యర్ జిల్లా లో ఉన్న రోజబల్ మందిరం క్రైస్తవులు, మహమ్మదీయులు , రెండు మతాల వారిచే తమదని నమ్మబడుతున్న వివాదాస్పద ధార్మిక ప్రదేశం. మహమ్మదీయులు ఈ మందిరం మహమ్మదీయ సాధువు అయిన యుజ్ అసఫ్ సమాధి అని, క్రైస్తవులు యేసు క్రీస్తు యొక్క శరీరం ఇక్కడే ఖననం కాబడ్డదని నమ్ముతారు. ఈ మందిరం జియరతి హజ్రతి యూజా అసౌఫ్ అనే పేరు తో సుప్రసిద్ధం.
కొందరి వాదన ప్రకారం క్రైస్తవ మత ప్రవక్త యేసు క్రీస్తు, శిలువ యొక్క గాయాల నుంచి కోలుకుని ఈ ప్రదేశానికి వచ్చాడని, తదనంతరం అతని పార్థివ దేహానికి యూదు ఆచారాలు సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. అయితే, స్థానికులు ఈ ప్రదేశం స్థానిక మహమ్మదీయ సాధువు మీర్ సయ్యిద్ నసీరుద్దిన్ ని మత సాంప్రదాయానుసారం అంత్యక్రియలు చేసిన సమాధి స్థలం అని నమ్ముతారు. సున్ని ముస్లింలు తో కూడిన సంచాలక సమితి ప్రస్తుతం రోజబల్ పుణ్యక్షేత్రం యొక్క బాగోగులు చూసుకుంటుంది.



Click it and Unblock the Notifications