మదీన్ సాహిబ్ సమాధి సుప్రసిద్ధుడైన మహమ్మదీయ మత సాధువు మదీన్ సాహిబ్ జ్ఞాపకార్థం నిర్మించారు. ఇది శ్రీనగర్ యొక్క అందమైన సమాధులలో ఒకటి. జాదిబల్ వద్ద ఉన్న మదీన్ సాహిబ్ మసీదు కి ఉత్తరాన ఉంది. గోడలకి నిగనిగలాడే పలకలు అలంకరించటం వల్ల ఈ మసీదు వెలుపల భాగం బాగా ఆకట్టుకుంటుంది. ఈ నిర్మాణం 15 వ శతాబ్దపు కాశ్మీరీ నిర్మాణ శైలి ని ప్రదర్శిస్తుంది.
మసీదు గోడలపై శాసనాలు అందరి దృష్టిని నిర్మాణ కాలం వైపు ఆకర్షిస్తాయి. గోడల పై ముఖ్యమైన మత ప్రబోధాలు కూడా చూడవచ్చు. చిరుత శరీరం తో ఉన్న ఒక మృగం బొమ్మ మసీదు ప్రవేశద్వారం వద్ద ఉంది. సాధారణంగా కాశ్మీర్ లో ని రాతి కట్టడాలలో కనిపించే పలక పని ఈ మసీదు కమాను ద్వారాల స్తంభాలు ప్రదర్శిస్తాయి. మదీన్ సాహిబ్ అనుచరులు పెద్ద సంఖ్యలో క్రమం తప్పకుండా ఇక్కడ ప్రార్థనలు నిర్వహించడం కోసం ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.



Click it and Unblock the Notifications