శ్రీ మహావిష్ణువు శేషతల్ప శాయి గా వుండే మూల విరాట్టు తో రంగానాథావతారంగా శ్రీరంగం లోని శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో పూజలందుకుంటాడు. ద్రావిడ నిర్మాణ శైలి లో వుండే ఈ గుడి నిర్మాణం గురించి ఎన్నో సార్లు ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో ప్రస్తావించారు. విష్ణువు ప్రధాన దైవంగా నిర్మించిన 108 దివ్య దేశాల్లో ఈ దేవాలయం మొదటిది.
దక్షిణ భారతం లోని సుప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఈ గుడి చాల ప్రముఖమైనది. వైభవంగా నిర్మించిన ఈ దేవాలయం ఒక సున్నితమైన ప్రదేశంలో నిర్మించ బడడం వల్ల ఇది బలానికి, శక్తికి ప్రతీక గా నిలుస్తుంది. ప్రాకృతిక ఉపద్రవాల అంచున వున్న ఈ దేవాలయం గతంలో చాలా సార్లు డచ్చి, పోర్చుగీస్, ఇంగ్లీష్ వారి దాడులను తట్టుకుని కాల పరీక్షకు నిలబడింది.