పంచాలంకురిచి కోట ను కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ అని కూడా అంటారు. ఇది సాలికులం లో కలదు. ఇతిహాసం మేరకు ఈ కోటను 18 వ శతాబ్దం లో పంచాలంకురిచి రాజు వీర పాండ్య కట్టబోమ్మన్ నిర్మించారు. ఈయన మదురై నాయక్ రాజ్యానికి కూడా ఒక నేత. ఈ కోట కు అనేక స్వాతంత్ర పోరాట యోధులు మరియు పాలకులు కూడా సంబంధించి వున్నారు.
1799 లో బ్రిటిష్ వారు ఒక యుద్ధంలో ఈ కోటను ధ్వంసం చేసారు.అపుడు వీర పాండ్య కట్టబోమ్మన్ బ్రిటిష్ వారిచే ఖైదు చేయబడ్డాడు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కోటను అర్కేయోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. 1974 లో తమిళ్ నాడు ప్రభుత్వం ఒక కొత్త కోటను పంచాలంకురిచి కోటకు గుర్తుగా కట్టి దానికి కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ అని పేరు పెట్టింది. ఈ కోట ఆవరణలో కట్టబోమ్మన్ ఇష్ట దేవత అయిన జక్కంమల్ దేవత గుడి కూడా కలదు. చరిత్ర ప్రియులు ఇది తప్పక చూడవలసిన ప్రదేశం.