అన్నామలై కొండల పాద ప్రాంతం లో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్ ఒక ప్రఖ్యాత హిందువుల పుణ్యక్షేత్రము . ఈ శివ దేవాలయం శైవులకు ఎంతో ముఖ్యమైనది . ఇక్కడి లింగ రూపం లోని శివుని, ఉన్నములైయమ్మన్ రూపం లోని ఉన్న పార్వతీ దేవి సమేతంగా పుజిస్తారు. ఈ దేవాలయం అగ్నిని సూచిస్తుంది, ఇక్కడ పరమశివుని అగ్ని లింగం రూపంలో కొలుస్తారు .
నయనార్స్ గా పేరుగాంచిన తమిళ మునులు మరియు కవుల రచనలలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది. నిజానికి దేశం లోని పెద్ద దేవాలయాల లో ఒకటైన ఈ దేవాలయం 10 హెక్టార్ లలో నిర్మించబడినది. ఈ దేవాలయం 4 ముఖద్వారపు గోపురాలతో అద్భుతంగా నిర్మించబడినది . తూర్పు వైపు గోపురం ఎత్తు 66 మీటర్లు ఇది నాలుగు గోపురాలలో పొడవైనది, అంతే కాదు దేశం లోనే అతి పొడవైన గోపురం. ఈ గోపురం 11 అంతస్థులు కలిగి ఉన్నది .