శ్రీ రమణాశ్రమన్ గ కుడా పిలవబడే ఈ రమణ ఆశ్రమం ,రమణ మహర్షి నివాస స్థలం లో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతం లో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లా లో పడమర వైపు విస్తరించి ఉన్నది
1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్సనార్ధమ్ వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరవాత కూడా చాలా మంది భక్తులు మరియు ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి , కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు .