14 శతాబ్దం కాలం నుండి ఆధ్యాత్మిక విశిష్టత కలిగినది ఈ విరుపక్ష గుహ. మొదట విరుపాక్ష దేవ ముని వలన పేరుగాంచిన ఈ గుహ తర్వాత రమణ మహర్షి వలన ఆయన భక్తులలో ప్రసిద్ది చెందింది. 1899 నుండి 16 ఏళ్ళు తన నివాసం గా మహర్షి ఉపయోగించు కున్నారు. 1916 లో మాత్రమే ఆయన గుహ నుండి బయటికి వచ్చారు. "సెల్ప్ ఎంక్వైరీ " మరియు "హూ యామ్ ఐ " లను ఈ గుహ లో ఉండగా రచించారు. అందువలననే ఆయన భక్తులు ఈ గుహ ను ఒక ఆలయం గా భావిస్తారు. అనేకమంది గుహ లో ధ్యాన సాధన తో ఆత్మా శాంతి కోసం ఈ గుహకు వస్తూ ఉంటారు.
విరుపాక్ష గుహకు శ్రీ రమణ ఆశ్రమం మరియు స్కందాశ్రమం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. మరొక మార్గం తిరువన్నామలై టెంపుల్, అరుణాచలేశ్వర టెంపుల్ ద్వారా నడిచి ఈ విరుపాక్ష గుహ ను చేరుకోవచ్చు. అనేక మంది భక్తులు నడక మార్గాన తిరువన్నామలై దేవాలయం నుండి గుహ కు చేరుకోవటం ఈ పుణ్య క్షేత్ర పర్యటన లో భాగంగా అది ఈ మహర్షులకు గౌరవం ఇవ్వటంగా భావిస్తారు.