ది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ స్నో వివిధ పేర్లతో ప్రసిద్ది చెందింది. సెయింట్ పాల్స్ చర్చ్ ఇంకా పనియ మాతా చర్చ్ వీటిలో కొన్ని. 1542 లో సెయింట్ ఫ్రాన్సిస్ సందర్శనతో ఈ ప్రాంతం పునితమైంది. ఆ తరువాత 1711 లో పోర్టుగీసు వారిచే నిర్మాణం చేపట్టబడిన ఈ చర్చ్ 1713 లో ప్రారంభం అయింది. మేరీ మాత కి ఈ చర్చ్ అంకితమివ్వబడింది. 1555 లో 'శాంతలీనా' ఓడ పై తూథుకుడి నుండి ఇక్కడికి తీసుకురాబడిన మేరీ మాత విగ్రహం ఈ చర్చ్ లో గమనించవచ్చు. 1982 లో ఈ మందిరానికి బసిలికా హోదా కల్పించబడింది.