దాదాపు 3000 ఏళ్ళ క్రితం నాటి అరట్టుపుజ్హ ఆలయం త్రిశూర్ నుండి ఒక గంట దూరం లో ఉంది. ఈ గుడిలో స్వామీ అయ్యప్ప కొలువుంటారు. ప్రతి రోజు ఈ గుడికి భక్తులు వస్తూ వుంటారు. ప్రతి సంవత్సరం మార్చ్ - ఏప్రిల్ నెలల లో జరిగే ఏడు రోజుల పూరం పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో నూట ఒక్క దేవుళ్ళు మరియు దేవతలు చుట్టుపక్కల ఆలయాల నుండి వచ్చి పాల్గొంటారు.
చివరి రోజైన ఏడవ రోజు నాడు ఇక్కడ ఉన్న దేవుడిని అర్రట్టుపుజ్హ నదికి సాంప్రదాయక స్నానం కోసం తీసుకువెళతారు. ఉదయం 5 నుండి 9:30 వరకు మరియు సాయంత్రం 5 నుండి 7 వరకు ఈ గుడి తెరిచే వేళలు.