ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలోని తలాసేరీ గతిసీలమైన నగరాలలో ఒకటి. ఘనమైన గత చరిత్ర, మంత్రముగ్ధుల్ని చేసే అనడంతో తెలిచేర్రీ గా పిలువబడే ఈ నగరం మలబార్ తీర మకుటంలో కలికితురాయి లాంటిది. భారతదేశంలో ఈ చారిత్రిక నగరానికి సర్కస్లు, కేకులు క్రికెట్ కు పుట్టినిల్లుగా పేరొందింది.
1682 లో వ్యాపారం చేసే ఉద్దేశ్యంతో బ్రిటీష్ వారు తలచేరీలో ప్రవేశించారు. కోస్తా తీరానికి దగ్గరగా ఉండడంతో ఈ నగరం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అయింది. అనేక సాహిత్య రాజకీయ ఉద్యమాలకు జన్మస్థానంగా ఉన్న ఈ నగరం మలబార్ తీరానికి సంస్కృత రాజధానిగా పేరుబడింది. ఈ చైతన్యవంతమైన నగరం నుండే మొదటి మలయాళ వార్తా పత్రిక వెలువడింది.
చరిత్రతో తొణికిసలాడే నగరం ఇంగ్లీష్ చర్చ్, జాలర్ల దేవాలయం, ఓవర్ బర్రీస్ ఫాలీ, తలసేరీ ఫర్, జుమా మసీదు తలసేరీ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలు. మొదటి మలయాళ ఆంగ్ల నిఘంటువు తాయారు చేసిన జర్మన్ దేశపు బిషప్ హెర్మన్ గండర్ట్ నివసించిన భవతి చరిత్ర ప్రేమికులకు ఆశక్తి గొలుపుతుంది. తలసేరీ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ ఫ్రెంచ్ సెటిల్మెంట్ మాహే, చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి.
వేలేస్లీ భవనం, రందత్తరా సినామేన్ ఎస్టేట్, కేథలిక్ రోసరీ చర్చ్, వామిల్ ఆలయం, ఉదయ్ పార్క్, ఉదయ్ కాలరీ సంఘం, ప్రభుత్వ భవనం, ఓడతిల్ పల్లి ఈ చారిత్రాత్మక పట్టణానికి వందలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. తలశేరీ నించి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములప్పిలాంగల్ బీచ్ ఏకైక డ్రైవ్ ఇన్ బీచ్.
కేకులు, బేకరీల పుట్టినిల్లు కావడం వల్ల తలసేరి లో ప్రత్యేకమైన వంటల సంస్కృతి వుంది. ఈ పట్టణంలో సాపేక్షంగా ఆహ్లాదకరమైన వాతావరణం వుంటుంది – రైల్, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి వుంది. సంస్క్ర్తులు, ప్రకృతి, రుచులు, చరిత్రల కలగూరగంపను చూడలనుకునేవారికి ఇది సరైన వినోద విహార స్థలం.