తలసేరి లోని ప్రసిద్ధ ధార్మిక ఆకర్షణల్లో ఒకటైన జుమా మసీదు అరేబియన్ సముద్రానికి పక్కనే వుంది. 1000 ఏళ్ళ నాటి ఈ మసీదు ఇస్లామిక్ పునరుజ్జీవనానికి కేంద్రస్థానం గా పని చేసింది. ఇస్లాం వ్యాప్తి కోసం కేరళకు వచ్చిన మాలిక్ ఇబిన్ దీనార్ అనే అరబ్ వర్తకుడు ఈ మసీదును నిర్మించాడు.
ఇండో సరసేనిక్ నిర్మాణ శైలికి ప్రసిద్ది పొందిన ఈ మసీదు తన గత వైభవాన్ని, ప్రాచీనతను ప్రదర్శిస్తుంది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు వందలాది మంది భక్తులు ఈ మసీదును సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు.
అరబిక్-మలయాళం సాహిత్యానికి ఎంతో సేవ చేసిన కుంజయన్ ముసల్ల్యార్ సమాధి ఈ మసీదులో వుంది. వందేళ్ళ నాటి ఈ ధార్మిక స్థలం తలసేరి సంస్కృతి, వారసత్వాలను ప్రదర్శిస్తుంది. తలసేరి నడిబొడ్డున వున్న ఈ జుమా మసీదుకు తేలిగ్గానే చేరుకోవచ్చు.