తలసేరీ కోట (తెల్లిచేర్రీ కోట) 1708 లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపనీ వారిచే నిర్మించబడిన చారిత్రక కట్టడం. బ్రిటీష్ వారి హయాంలో వాణిజ్య, సైనిక కార్యకలాపాలలో ఇది ప్రధాన పాత్ర పోషించింది. ముజేప్పిలన్గాడ్ తీరం వెంట ఉన్న కొండ చెరియ మీద నిర్మించిన ఈ కోట బ్రిటిష్ పాలనకు, మైసూర్ దాడికి సంబంధించిన అనేక కధలను తెలియచేస్తుంది.
పెద్ద పెద్ద గోడలు, విస్తారంగా అలంకరించిన ద్వారాలు ఈ కోటలో ఉన్నాయి. అరేబియన్ సముద్రానికి దారితీసే రహస్య సొరంగ మార్గాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం హైదర్ అలీ దీన్ని చేజిక్కించుకోవడానికి 1781 లో విఫలయత్నం చేసాడు.
ఈ కోట పునాదులు పెద్ద లాటరైట్ రాళ్ళతో నిర్మించి, ద్వారాలు 18 వ శతాబ్దానికి చెందిన కుడ్య చిత్రాలతో అలంకరించారు. భారతీయ పురావస్తు శాఖ పరిరక్షిస్తున్న కొన్ని స్మారకాల్లో తలసేరి కోట ఒకటి. ఈ కోట లోపల వున్న సమాచార శాలలో సమాధులు, కట్టడాలు, ప్రాచీన చిత్రాలు చక్కగా ప్రదర్శిస్తున్నారు.
సమయం: ఉదయం 8.00 – సాయంత్రం 6.00 ప్రవేశ రుసుము: లేదు