సుల్తాన్ బతేరి పట్టణాన్ని గతంలో గణపతి వాటం అనేవారు. ఈ చారిత్రక పట్టణం కేరళలోని వయనాడు జిల్లా లో కలదు. కేరళ - కర్ణాటక సరిహద్దులలో కలదు. ఒక్క రోజు పర్యటన చేయాలనుకునే వారికి ఈ ప్రాంతం సరైనది. ప్రశాంతమైన ఈ పట్టణం మైసూరు పాలించిన టిప్పు సుల్తాన్ చే దండ యాత్ర చేయబడింది. ఇక్కడి జైన టెంపుల్ ని టిప్పు సుల్తాన్ తన బాటరీ గా వాడుకోనటం చేత ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది. సుల్తాన్ బతేరి కి చారిత్రిక ప్రాధాన్యతే కాదు, అందమైన కొండల సమూహాల తో , పచ్చటి పచ్చిక భూములతో ఈ ప్రదేశం అతి మనోహరంగా ఉంటుంది. వయనాడు జిల్లలో సుల్తాన్ బతేరి ఒక ప్రధాన పట్టణం మరియు వాణిజ్య కేంద్రం. ఇక్కడ టూరిజం మరియు వ్యవసాయ కార్యకలాపాల కారణంగా ఆదాయం వస్తుంది. సుల్తాన్ బతేరి పై టిప్పు సుల్తాన్ చేసిన దండయాత్ర, దాని కల్చర్ మరియు ప్రజల జీవన విధానాలను బాగా ప్రభావితం చేసింది. ఇక్కడ సుల్తాన్ ఒక కోట కట్టాడని చెపుతారు. కాని నేడు దాని అవశేషాలు కూడా కనపడవు.
ప్రకృతి దృశ్యాలు మరియు సుగంధాల కొండలు
సుల్తాన్ బతేరి గ్రామీణ వాతావరణం కలిగిన ఒక చిన్న గ్రామం. ఈ ప్రదేశం దాని సుగంధాల తోటలకు ప్రసిద్ధి గాంచింది. పట్టణానికి వెళితే చాలు సుగంధాల వాసనలు అద్భుతంగా వ్యాపించి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి. సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండటం చేత అన్ని కాలాలలోనూ వాతావరణం బాగుంటుంది.
సరిహద్దులలో ఉండటం చేత ఈ చిన్న పట్టణాన్ని కేరళ మరియు కర్ణాటక, రెండు రాష్ట్రాలనుండి తేలికగా చేరవచ్చు. బెంగుళూరు, మైసూరు, కాలికాట్ మరియు కన్నూర్ ల నుండి రోడ్డు మార్గాలు సౌకర్యవంతం గా వుంటాయి. ప్రకృతి దృశ్యాలు మరియు అనుకూల వాతావరణం ఈ ప్రదేశాన్ని ఒక విశ్రాంతి సెలవుల ప్రదేశంగా మార్చి వేసాయి.