కేరళలోని క్యాథలిక్ క్రైస్తవులకు ప్రాచీన క్యాథలిక్ రోజరీ చర్చి ప్రసిద్ధ ప్రార్ధనా స్థలం. తలసేరి కోట కు దగ్గరలో వున్న ఈ చర్చికి దాని చారిత్రిక ప్రాముఖ్యం, నిర్మాణ వైభవం వల్ల ఎంతో మంది యాత్రికులు వస్తారు.
లండన్ నుంచి తెచ్చిన గాజుతో చేసిన అద్దాలతో నిర్మించిన భవనానికి ఈ చర్చి సుప్రసిద్ధం.16వ శతాబ్దంలో నిర్మించిన ఈ క్యాథలిక్ రోజరీ చర్చి కేరళ లోని ప్రాచీన చర్చీలలో ఒకటి. బ్రిటిష్ కాలంలో ఇది చాలా ప్రాముఖ్యాన్ని అనుభవించింది.
దీని నిర్మాణం పూర్తైనప్పటి నుంచి దీని యాజమాన్యం చాలా మారింది. మొదట్లో గోవా ఆర్చి బిషప్ అధీనంలో వున్న ఈ చర్చి 1609 దాకా అలాగే వుంది. తరువాత ఈ చర్చిని కొడు౦గల్లూర్ ఆర్చ్ డయోసీస్ తీసుకు౦ది – ఇప్పుడు దీన్ని కన్నూర్ ఆర్చ్ డయోసీస్ నిర్వహిస్తోంది. ఎంతో మంది బ్రిటిష్ అధికారులన్ సమాధి చేసిన ఈ చర్చిలోని స్మశానవాటిక పర్యాటకులను, చరిత్ర ప్రేమికులను ఆకర్షిస్తుంది.