ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం మరియు హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం రిశికేష్. ఈ పట్టాణాన్నే దేవభూమి అని పిలుస్తారు. పవిత్ర గంగా నది తీరాన ఉన్న రిశికేష్ ను, పక్కనే ఉన్న హిమాలయాలను సందర్శించడానికి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. డెహ్రాడూన్ జిల్లాలో గల ఈ పట్టణం పురాతన ఆలయాలతో మరియు ఆశ్రమాలతో విశ్వఖ్యాతి గడించింది.
కేవలం ఆలయాలు, ఆశ్రమాలే కాక ఇక్కడ మరికొన్ని చెప్పుకోదగ్గ విశేషాలు దాగి ఉన్నాయి. ఇందులో భాగంగా పర్యాటకులు ఇక్కడ అనేక సాహస క్రీడలు, ట్రెక్కింగ్ యాత్రలు వంటివి చేసుకోవచ్చు. ఈ ప్రదేశం ముఖ్యంగా రివర్ రాప్టింగ్ కి ప్రసిద్ధి చెందినది. అనేక అంశాలతో, విశేషాలతో మిళితమైన ఈ ప్రదేశంలో పర్యాటకులు, భక్తులు మరియు సాహస యాత్రికులు పర్యటించవలసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఇప్పుడు మీకోసం ...
కున్జపురి ఆలయం
కున్జపురి ఆలయం రిశికేష్ పట్టణం నుండి 15 కి.మీ. దూరంలో ఒక చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయం వద్ద సూర్యోదయం, సూర్యాస్తమ సమయాలు చాలా బాగుంటాయి. ఈ ఆలయం శివాలిక్ పర్వత శ్రేణి పంక్తులలో ఉన్న13 ప్రముఖ ఆలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని సందర్శించేటప్పుడు పర్యాటకులు చుఖంబ, స్వర్గ, రోహిణి, బందేర్పున్చ్ మరియు గంగోత్రి తో సహా గర్హ్వాల్ హిమాలయాల శిఖరాలను చూసి ఆనందించవచ్చు.
Photo Courtesy: Travel & Shit
భారత్ మందిర్
భారత్ మందిరం ఆదిగురు శంకరాచార్యుల వారితో పవిత్ర గంగానది ఒడ్డున స్థాపించబడిన పురాతన విష్ణుమూర్తి ఆలయం. ఆలయంలో ఉన్న విష్ణు విగ్రహం శాలిగ్రం రాయి యొక్క ముక్క ను ఉపయోగించి తయారు చేశారు. ఈ రాయి హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు మరియు ఇది విష్ణువు సూచిస్తుంది. తొమ్మిది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న త్రిభుజాలతో కూడిన ఒక అందమైన శ్రీ యంత్ర ఆలయం లోపల చూడవచ్చు. బసంత్ పంచమి అనే ప్రముఖ హిందూ మత పండుగ ఈ ఆలయంలో ఉత్సాహంతో జరుపుకుంటారు.
Photo Courtesy: Rishikesh Writings
లక్ష్మణ్ ఆలయం
రిశికేష్ లో ఉన్న ప్రధాన ఆకర్షణల లో ఒకటిగా చెప్పబడే ఈ లక్ష్మణ్ ఆలయం, పట్టణానికి 5 కి.మీ. దూరంలో ఉన్నది. లక్ష్మణ్ ఆలయం రాముని సోదరుడైన లక్ష్మణుడికి అంకితం చేయబడిన ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నది. ఆలయ గోడలపై నగిషీలు చెక్కిన చిత్రాలను చూడవచ్చు.
Photo Courtesy: Kori Brus
నీలకంఠ మహాదేవ ఆలయం
నీలకంఠ మహాదేవ ఆలయం, రుషికేష్ లో ప్రముఖ మత కేంద్రంగా ఉంది. సముద్ర మట్టానికి 1330 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉన్న ఈ మందిరం నుండి విశ్నుకూట్, బ్రహ్మకూట్ మరియు మనికూట్ కొండల అద్భుతమైన వీక్షణను చూడవచ్చు. ఈ ఆలయం హిందూ మత దేవుడైన శివుడికి అంకితం చేయబడింది. భక్తులు వేల సంఖ్యలో శ్రావణ మాసంలో, శివరాత్రి రోజున ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.
Photo Courtesy: Munish Chandel
శివపురి
శివపురి రుషికేష్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. హిందూ మత దేవుడైన శివయ్యకి అంకితమైన పలు ఆలయాలు ఉండుట వల్ల , ఈ స్థలం శివుడు యొక్క నివాసం అనగా 'శివపురి' అనే పేరు వచ్చింది. సాహస ఔత్సాహికులు శివపురి నుండి రుషికేష్ కు తెప్ప ద్వారా వెళ్లి థ్రిల్ ను అస్వాదించవచ్చు.
Photo Courtesy: Dr Satendra
స్వర్గ్ నివాస్ ఆలయం
స్వర్గ్ నివాస్ ఆలయం 13 అంతస్తులు కలిగిన ఒక భారీ ఆరంజ్ రంగు గల ఆలయం. ఈ 13 అంతస్తుల ఆలయం ప్రతి అంతస్తులో వివిధ హిందూ మత దేవతల అనేక చిన్న విగ్రహాలు ఉన్నాయి. గంగా నది మరియు రుషికేష్ లు ఈ ఆలయం నుంచి మంత్రముగ్దులను చేసే వీక్షణ లభిస్తుంది.
Photo Courtesy: Michael Ferranti
తేరా మంజిల్ ఆలయం
రిశికేష్ సమీపంలో ఉన్న తేరా మంజిల్ ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరియు వివిధ హిందూ మత దేవతలకు, దేవుళ్ళకు అంకితం చేసిన 13 అంతస్తుల ఏకైక దేవాలయం. ఇతర సాధారణ దేవాలయాలకు మరియు ఈ దేవాలయానికి అదే తేడా. పదమూడు అంతస్థుల ఈ ఆలయం నుండి సూర్యాస్తమయం వీక్షణ అద్భుతం. దేవాలయం చుట్టూ అద్భుతమైన సహజ అందం వందలాది మంది భక్తులతో పాటు పర్యాటకులను ఆకర్షిస్తుంది.
Photo Courtesy: Sunrider007
కాళి కంబ్లివలె పంచాయతి క్షేత్ర
కాళి కంబ్లివలె పంచాయతి క్షేత్ర ను శ్రీ బాబా విశుద్ధ నందాజి స్థాపించెను. ఇది రుషికేష్ లో ఉన్న పురాతన ఆశ్రమాలలో ఒకటిగా భావిస్తారు. గతంలో ఆశ్రమంను బాబా మరియు అతడి శిష్యులు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం ఇది ఒక ధర్మకర్త పర్యవేక్షణలో ఉండి, వివిధ ప్రదేశాలలో విస్తరించి ఉంది. ఆశ్రమంలో ప్రయాణీకులు ఉండటానికి వసతి సౌకర్యాలను అందిస్తుంది.
Photo Courtesy: Janiscula
గీత భవన్
గీత భవన్ గంగా నది ఒడ్డున ఉన్న పురాతన నిలయం. ఇక్కడ మహాభారతం మరియు రామాయణం కు సంబంధించిన చిత్రాలను గోడలపై చెక్కినారు. పవిత్ర గంగా నదిలో స్నానం చేసిన భక్తులు గీత భవన్ లో ధ్యానం చేసుకోవచ్చు మరియు సాధువుల భోధనాలను వినవచ్చు. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి గదులు కూడా ఉన్నాయి. భోజన వసతి సదుపాయమూ లేకపోలేదు కాకపోతే పూర్తిగా శాఖాహార వడ్డిస్తారు. మీఠాయీలు మరియు ఇతర వంట సామాగ్రి లేదా ఏదేని వస్తువు కొన్న సరసమైన ధరకే ఇక్కడ లభిస్తుంది.
Photo Courtesy: Watercooker
ఓంకారనంద ఆశ్రమం
ప్రముఖ హిందూ తత్వవేత్త, మహర్షి మరియు రచయిత అయిన ఓంకారనంద సరస్వతి 1967 వ సంవత్సరంలో పవిత్ర గంగా నది ఒడ్డున ఓంకారనంద ఆశ్రమంను స్థాపించెను. ఈ ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలు, యోగా శిక్షణ తరగతులు మరియు యజ్ఞాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న పాఠశాలలో పర్యాటకులు లేదా ఇక్కడ శిక్షణ నిమిత్తం వచ్చే విధ్యార్థులు శాస్త్రీయ సంగీతం మరియు శాస్త్రీయ నృత్యం నేర్చుకోవచ్చు.
Photo Courtesy:Watercooker
పరమార్థ్ నికేతన్
రిశికేష్ లో ఉన్న పరమార్థ్ నికేతన్ 1000 గదులతో వసతి కలిగిన పెద్ద ఆశ్రమం. మైటీ హిమాలయాల నడుమ ఉండే ఈ ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్సాలతో పాటు సంగీత చికిత్సలు అందిస్తుంటారు. ప్రజలు యోగా, ధ్యానం మరియు ఇతర పద్దతులను నేర్చుకోవడానికి ఈ ఆశ్రమం కు తరచూ వస్తుంటారు. ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ యోగా ఫెస్టివల్ ను వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
Photo Courtesy: Ken Wieland
శివానంద ఆశ్రమం
శివానంద ఆశ్రమాన్ని పవిత్ర గోదావరి నది ఒడ్డున స్వామి శివానంద 1932 వ సంవత్సరంలో స్థాపించెను. ఈ ఆశ్రమం పూర్తిగా ఆధ్యాత్మిక సేవలను మాత్రమే అందిస్తుంది. శివానంద ఆయుర్వేద ఫార్మసీ, యోగ - వేదాంత ఫారెస్ట్ అకాడమీ మరియు శివానంద కంటి ఆసుపత్రి వంటి సంస్థలను ఈ ఆశ్రమం నడుపుతుంది.
Photo Courtesy: Ken Wieland
స్వర్గ్ ఆశ్రమం
స్వర్గ్ ఆశ్రమం గంగా నది ఒడ్డున, రుషికేష్ నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. దుకాణాలు, కేఫ్లు, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్, ఆయుర్వేద చికిత్సాలయాలు, గ్రంథాలయాలు, ధ్యానం కేంద్రాలు, హోటళ్ళు మరియు రెస్టారెంట్లతో పాటు లోపల వివిధ చిన్న ఆశ్రమములు ఉన్నాయి.
Photo Courtesy: himalaya yoga academy
వశిష్ట గుఫా
వశిష్ట గుఫా, రుషికేష్ నుండి 16 కి. మీ. దూరంలో గంగా నది ఒడ్డున ఉంది. ఈ గుఫా ధ్యానం చేయటం కోసం ఒక ప్రముఖ ప్రదేశం మరియు గులర్ చెట్లు పిలువబడే ఈ మర్రి చెట్లు, గుబురుగా పెరిగిన వృక్షాలు మధ్య ఉంది. హిందువులు పవిత్రంగా భావించే శివలింగం గుఫా సమీపంలో ఉన్నది. ఈ ఆశ్రమంను అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు.
Photo Courtesy: Bo Kage Carlson
లక్ష్మణ్ ఝూలా
లక్ష్మణ్ ఝూలా అనేది నది, దేవాలయాలు మరియు ఆశ్రమాల అద్భుతమైన వీక్షణను అందించే 450 అడుగుల వేలాడే గొలుసు వంతెన. రాముడు తమ్ముడు అయిన లక్ష్మణ్ ఒకప్పుడు గంగా నదిని దాటటానికి ఈ వంతెనను ఉపయోగించాడని నమ్ముతారు. అందువల్ల ఈ వంతెనను లక్ష్మణ్ ఝూలా అని పిలుస్తారు. ఈ వంతెన నుండి 2 కి. మీ. దూరంలో ప్రఖ్యాత స్వర్గ్ ఆశ్రమం ఉంది.
Photo Courtesy: Tylersundance
రాం ఝూలా
స్వర్గ్ ఆశ్రమం ను శివానంద ఆశ్రమం తో కలిపే ఈ రాం ఝూలా రిశికేష్ లో ప్రధాన ఆకర్షణ వంతెనగా చెప్పుకోవచ్చు. ఇది లక్ష్మణ్ ఝూలా కంటే కొత్తది మరియు పెద్దది. దీనిని కూడా పవిత్ర గోదావరి నది మీద నిర్మించినారు.
Photo Courtesy: Michael Hoy
త్రివేణీ ఘాట్
గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశమే త్రివేణీ ఘాట్. పంచకర్మ ఉన్న దేవాలయాలను సందర్శించే ముందు, భక్తులు ఈ సంగమంలో మునిగి తేలుతారు. సాయంత్రంవేళ భక్తులు మహా హారతి కోసం ఘాట్ కి వస్తుంటారు.
Photo Courtesy: proorismos
రిశికుండ్
రిశికుండ్ పవిత్ర త్రివేణీ ఘాట్ వద్ద ఉన్న పవిత్ర చెరువు. పర్యాటకులు ఈ చెరువులో రాముడు మరియు సీత అంకితం చేయబడిన రఘునాథ్ ఆలయ ప్రతిబింబాన్ని చూడవచ్చు.
Photo Courtesy: Manas Mayur
కుడియాల
సముద్ర మట్టానికి 380 మీటర్ల ఎత్తులో ఉన్న కుడియాల రుషికేష్ - బద్రీనాథ్ హైవే మీద ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. కుడియాల చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి. కుడియాలలో ప్రయాణీకులకు వారి పర్యటన సందర్భంగా దృష్టి విభిన్న జంతువులు మీద ఉంటుంది. సాహస ఔత్సాహికులు వైట్ వాటర్ తెప్పను ఆస్వాదించడానికి నిపుణుల మార్గదర్శకత్వంలో ఈ ప్రదేశంలో శిబిరం ఉన్నది.
Photo Courtesy: Nagesh Kamath
రాజాజీ నేషనల్ పార్క్
రిశికేష్ కు 6 కి. మీ .దూరంలో ఉన్న ఈ రాజాజీ పార్క్ మూడు అభయారణ్యాల కలయిక. ఆసియా ఏనుగులు, పులులు, నాగుపాములు, చిరుత పులులు, సంబర్స్, కుందేళ్ళు, అడవి పిల్లులు, కాకర్ లు, చిరుత, ఎలుగుబంటి, జింకలు మరియు ఇతర జంతువులు ఇక్కడ చూడవచ్చు.
Photo Courtesy: Fubu19
ట్రెక్కింగ్
రుషికేష్ లో ట్రెక్కింగ్ అత్యుత్తమ ఆనందాన్ని మరియు ప్రసిద్ది చెందిన సాహసోపేత కార్యకలాపంగా ఉంటుంది. ట్రెక్కింగ్ ఈ ప్రాంతంలో సులభం కాబట్టి శారీరక ఆరోగ్యం కోసం ప్రజలు కూడా సరదాగా చేయవచ్చు. రూప్కుండ్ త్రిశూల్ రిడ్జ్ వద్ద 5029 మీటర్ల ఎత్తులో మరొక ప్రసిద్ధ ట్రెక్కింగ్ జోన్ ఉంది. కూరి పాస్, దేవీ నేషనల్ పార్క్, కాళింది ఖల్ ట్రెక్ మరియు కంకుల్ ఖల్ ట్రెక్ ఇష్టపడే ఇతర ట్రెక్కింగ్ మార్గాలు గా ఉన్నాయి. ఫిబ్రవరి మరియు అక్టోబర్ మధ్య కాలంలో ఈ ప్రదేశాలలో ట్రెక్కింగ్ అనువైనవిగా భావిస్తారు.
Photo Courtesy: Bo Kage Carlson
మౌంటెన్ బైకింగ్
మౌంటెన్ బైకింగ్ అనేది ప్రయాణికులు రుషికేష్ పర్యటన సందర్భంగా పొందవచ్చు. బైకింగ్ ఔత్సాహికులు అవసరమైన పరికరాలు మరియు శిక్షణ పొందడానికి ఈ ప్రాంతంలో పర్యాటక నిర్వాహకులను సంప్రదించవచ్చు. రుషికేష్ దగ్గరగా ప్రసిద్ధ పర్వత బైకింగ్ ప్రాంతంగా మొహన్చాట్టి ఉంది.
Photo Courtesy: treklocation
నురగ నీటిలో తెప్ప నడపడం
నురగ నీటిలో తెప్ప నడపడం రిశికేష్ పట్టణంలో పర్యాటకులకు బాగా ప్రసిద్ధి చెందింది. గంగా నది రెండు మధ్యతరహా మరియు కఠినమైన రాపిడ్లను కలిగి ఉంటుంది కాబట్టి శిక్షణ పొందిన అలాగే తెప్ప ఆరాధకులకి ఒక ఖచ్చితమైన స్థావరంగా పనిచేస్తుంది. జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులు భారీ సంఖ్యలో ఈ క్రీడలో పాల్గొని థ్రిల్ ని అనుభవించడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు.
Photo Courtesy:Siddharth Nagi
షాపింగ్
షాపింగ్ పర్యాటకులు రుషికేష్ లో షాపింగ్ ను అస్వాదించవచ్చు. నగరం సందర్శించే ప్రయాణికులు వివిధ హిందూ మత దేవతలు, నటరాజ విగ్రహాలు, మత పుస్తకాలు రుద్రాక్ష, విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. శీతాకాలం దుస్తులు,కుర్తాస్ మరియు అల్లికల్తో ఉన్న సల్వార్ లు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. అవే కాకుండా, రుషికేష్ షెల్ల్స్ ,ముత్యాలు, మరియు పూసలు నుండి తయారు చేసిన హస్తకళ వస్తువులకు పేరు గాంచింది.
Photo Courtesy: Deep Goswami
రిశికేష్ ఎలా చేరుకోవాలి ??
వాయు మార్గం
డెహ్రాడున్ లోని జాలి గ్రాంట్ ఎయిర్ పోర్ట్ రిషికేశ్ కు దగ్గర లోని ఏర్పోర్ట్. ఇది ఇక్కడికి 18 కి. మీ. దూరంలో ఉన్నది. ఢిల్లీలోని ఇందిరా గాంధి ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ దీనికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ ఏర్పోర్ట్. అక్కడి నుండి భారత దేశపు ముఖ్య నగరాలకు ఫ్లైట్స్ లభిస్తాయి. పర్యాటకులు క్యాబ్ లను అద్దెకు తీసుకొని ఇక్కడికి రావచ్చు.
రైలు మార్గం
రిషికేశ్ లోని రైల్వే స్టేషన్ భారత దేశపు ఢిల్లీ, ముంబై, కోట్ద్వార్ మరియు డెహ్రాడున్ వంటి ముఖ్య నగరాలను కలుపుతుంది. ఇది నగరానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్నది.
రోడ్డు మార్గం
రిషికేశ్ దగ్గరలోని ఢిల్లీ, డెహ్రాడున్, మరియు హరిద్వార్ వంటి నగరాలకు బస్సుల ద్వారా అనుసంధానించబడి ఉన్నది. ఈ నగరాల ప్రైవేటు లేదా రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.
Photo Courtesy: Sumit Gupta