కావేరి నది ఒడ్డున ఉన్న గుణశీలం విష్ణు ఆలయం విష్ణు మూర్తి కి చెందినది. ఈ ఆలయం 48 రోజులలో మానసిక వికలాంగులను నయం చేస్తుందని నమ్ముతారు, అయితే ఆ సమయంలో వారిని ఇక్కడ వదలి వెళ్ళాలి. ఈ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న వెంకటాచలపతి. విఖానసర్ సన్నిధి ఈ ఆలయం ప్రాంగణంలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడైన విఖానసర్ ని వెంకటేశ్వర స్వామీ ఆశీర్వదించాడని చెప్తారు.