ట్రిచీ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో వయలూర్ మురుగన్ దేవాలయం వుంది. ఈ దేవాలయం మురుగన్ దేవుడి కోసం నిర్మించినది. ఈ దేవాలయాన్ని 1200 ఏళ్ళ క్రితం చోళ రాజుల పాలనలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని ఆది వయలూర్, కుమారా వయలూరు, వన్ని వయలూరు, అగ్నీశ్వరం లాంటి ఇతర పేర్లతో కూడా వ్యవహరిస్తారు.
శివుడు, నటరాజు, పాయియ గణపతి, వల్లీ, దైవనై విగ్రహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణం లో వున్నాయి. ఇక్కడి నటరాజు విగ్రహంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన రెండు పాదాలు నేల మీదే వుంటాయి. ఈ విగ్రహాల కోసం ప్రత్యెక ఉత్సవాలు కూడా జరుగుతాయి.