జైన మతస్థులకు వేణూర్ ఒక ప్రధాన యాత్రా స్ధలం. ఈ చిన్న పట్టణంగురుపూర్ నది ఒడ్డున ఉంది. నేడు తన ప్రాధాన్యతను కోల్పోయినప్పటికి, చరిత్రలోకి వెళితే, ఈ పట్టణం ఒకప్పుడు జైన మతానికి ఎంతో ప్రధాన కేంద్రంగా ఉండి అజిల వంశ పాలకులకు రాజధానిగా ఉండేది.
జైనుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
వేణూర్ పట్టణానికి చారిత్రక మరియు మతపర విశిష్టత ఎంతో ఉంది. ఈ పట్టణంలో 35 అడుగుల ఎత్తుకల గోమతేశ్వర విగ్రహం ప్రధాన ఆకర్షణ. ఈ విగ్రహాన్ని 1604 సంవత్సరంలో జైన రాజు తిమ్మన్న అజిల నిర్మించారు. కర్నాటకలోని నాలుగు ఏకశిలా గోమతేశ్వర విగ్రహాలలో ఇది ఒకటి.
వేణూర్ పట్టణంలో అనేక పురాతన జైన మందిరాలు చూడదగినవి కలవు. గ్రామీణ ప్రాంతంలో ఏడు పురాతన దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలు అద్భుత శిల్పకళా నైపుణ్యతలు కలిగి ఆకాలం నాటి వైభవానికి చిహ్నంగా ఉంటాయి. గోమతేశ్వర విగ్రహానికి ఇరుపక్కలా రెండు దేవాలయాలుంటాయి. సహజ అందాలకు నిలయమైన ఈ ప్రదేశం సహ్యాద్రి హిల్స్ సమీపంలో ఉండి మరింత అందచందాలను సంతరించుకొంది. వేణూర్ పట్టణం, జైనుల ఇతర కేంద్రాలైన ధర్మస్ధల మరియు కర్కాల పట్టణాలకు సమీపంలో ఉంది.
వేణూర్ దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. మంగుళూరుకు సౌకర్యవంతమైన రోడ్డు కలదు. ఇక్కడనుండి టాక్సీలు, బస్సులలో ఉడుపి కూడా చేరవచ్చు.