హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న మండి కి నడిబొడ్డు లో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ భూతనాథ్ టెంపుల్. రికార్డుల ప్రకారం, రాజా అజ్బెర్ సేన్ చేత 1527 లో ఈ ఆలయం నిర్మించబడినదని తెలుస్తోంది. హిందువుల దేవుడు, లయకారుడు అయిన శివుడికి ఈ ఆలయం అంకితమివ్వబడినది. భియులి నుండి ప్రస్తుతం ఉన్న ప్రాంతానికి రాష్ట్ర రాజధాని మార్పు జరిగిన కాలం లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది.
మరి కొంత మంది కొండ దేవుళ్ళతో కలిసి మండి రాష్ట్రాన్ని ఏలిన దేవుడు రాజ్ మాధవ్, శివరాత్రి పండుగ రోజున ఉత్సవం మొదలవ్వడానికి ముందు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రార్ధనలు చేస్తారని గాధలు చెబుతున్నాయి. వారం రోజుల పాటు ఘనంగా నిర్వహింపబడే ఈ పర్వదినం లో వేల కొద్దీ భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. 100 మంది స్థానిక దేవతలు కూడా ఈ పండుగ సమయం లో విచ్చేస్తారని నమ్ముతారు.