పండాలం మహదేవ దేవాలయం కేరళలోని ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇది అచంకోవిల్ నది ఒడ్డున కలదు. ఈ ప్రాచీన మత పర స్ధలం పండాలం పట్టణంలో అంటే అదూర్ కు 10 కి.మీ.ల దూరంలో కలదు. ఈ దేవాలయం పట్టణ మధ్య గా ఉండటం చేత భక్తులను ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఆకర్షిస్తుంది. ఈ దేవాలయ ప్రధాన దైవం శివ భగవానుడు.
దేవాలయ సముదాయంలో గణేశ, మాయా ఎక్షి అమ్మ, స్వామి అయ్యప్ప, నాగరాజ, సుబ్రమణ్యేశ్వరుడు, బ్రహ్మ రాక్షస మరియు రాక్షసుల విగ్రహాలుంటాయి. ప్రతి ఏటా జరిగే కెట్టుకాజచ్చ పండుగ ఈ దేవాలయంలో పర్యాటకులకు భక్తులకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో పది రోజులపాటు ఈ పండుగ నిర్వహిస్తారు. దేవాలయ జెండా ఎగుర వేయడంతో వేడుకలు మొదలవుతాయి. వేడుకలు అరాట్టు అనే కార్యక్రమంతో ముగుస్తాయి. నది ఒకడ్డున కల దేవాలయం అవటంతో పండాలం మహదేవ దేవాలయం పర్యాటకులకు నదీ తీర అందాలను, భక్తులకు దైవ భక్తిని ప్రసాదిస్తుంది. పార్ధసారధి దేవాలయం