జస్వంత్ కి చత్రి ఒక గుమ్మటం ఆకారంలోని స్మృతి చిహ్నం. దీని మంటపం హిందూ, మొఘల్ లక్షణాలు పొందపరచిన ప్రసిద్ధ రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలికి ఉదాహరణ జస్వంత్ కి చత్రి గా పేరు పొందినప్పటికీ దీనిని రెండవ జస్వంత్ సింగ్ రాజు గౌరవార్ధం కాక, రాజస్థాన్ లోని బుండి యువరాణి రాణి హద జ్ఞాపకార్ధం అంకితమిచ్చారు. ఆమె ఆగ్రా కోటలో 1644 లో జూలై 25 న మరణించిన అమర్ సింగ్ రాథోడ్ ను వివాహమాడింది.
పురాణాల ప్రకారం, అతని దేహాన్ని రాణి హదకు ఇచ్చినప్పుడు తన భర్త దేహంతో ఆవిడ సతికి పాల్పడింది. అమర్ సింగ్ రాథోడ్ తమ్ముడైన జస్వంత్ సింగ్ రాజు ఈ గొప్ప రాజపుత్ర యువరాణి సతికి జ్ఞాపకార్ధంగా ఈ చత్రిని కట్టించాడు. అయితే ఈ కట్టడం దానిని నిర్మి౦చిన జస్వంత్ సింగ్ పేరున ప్రసిద్ధమైంది.
ఇది క్రీ.శ. 1644-58 మధ్య మొఘలుల పాలనా కాలంలో కట్టించిన ఒకే ఒక్క హిందూ చారిత్రిక కట్టడం. ఇది యమునా నది ఒడ్డున రజ్వార, బల్కేశ్వర్ లో ఉంది.