ప్రపంచపు ఏడు వింతలలో ఒకటి అయిన తాజ్ మహల్ ను, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అందమైన భార్య ముంతాజ్ మహల్ పైన ఉన్నప్రేమకు గుర్తుగా, ఆమె సమాధిని ఆగ్రా లో నిర్మించారు. భారతీయ, పెర్షియన్ మరియు ఇస్లాం భవన నిర్మాణ శైలుల అత్యుత్తమ లక్షణాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ.
దీని నిర్మాణాన్నివేలకొద్ది సేవకులు, కళాకారులు మరియు రాళ్ళతో 1632 లో ప్రారంభించి, 21 సంవత్సరాలలో, 1653 లో పూర్తీ చేశారు. ఈ గొప్ప భవనంలో ముఖ్యమైన ఆకర్షణ అతని భార్య సమాధే. ఒక చదరపు వేదిక పై నిలబెట్టిన, తెల్ల పాలరాయితో సమాధి ఉన్నది ఇది ఒక వంపు తిరిగిన గోపురం కింద ఉంది మరియు దీనిని ఒక వొంపు తిరిగిన గేటు గుండా చేరుకోవొచ్చు.
తాజ్ మహల్ కూడా సాధారణ మసీదుల రూపకల్పన లాగానే 40 మీటర్ల ఎత్తు సిమ్మెట్రికల్ మినార్లలాగా అలంకరింపబడి ఉన్నది. ఇక్కడినుండి ముస్లింమత విశ్వాసపాత్రుల కొరకు మ్యుజిన్ ప్రార్థన కోసం పిలుపు ఇస్తాడు. ఒక్కో మినారెట్ మూడు భాగాలను కలిగి ఉన్నది మరియు రెండు బాల్కనీలు ఉన్నాయి.
ఒక కళాత్మకమైన, రమణీయ దృశ్యాలు కలిగిన 300 మీటర్ స్క్వేర్ చార్బాగ్ లేదా తోట ఉన్నది. దీనిలో 16 పూలపరుపులవంటి కాలినదకదారులు ఉన్నాయి.