అలీ ఘర్ ముస్లిం యూనివర్సిటీని గతంలో మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేవారు. అలీ ఘర్ యూనివర్సిటీ 18 లేదా 19 శతాబ్దాలలో చదువులకు, పరిశోధనలకు ఒక ప్రధాన కేంద్రంగా వుండేది. ప్రతిష్టాత్మక ఈ యూనివర్సిటీ ని సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. దీనిలో దేశం లోనే అతి పెద్ద లైబ్రరీ కలదు. ఈ విద్యా సంస్థ జాతీయ, అంతర్జాతీయ విద్యార్ధులకు సుమారు 300 కోర్సులను నిర్వహిస్తోంది. ఈ యూనివర్సిటీ ని మొదట్లో ముస్లింల అభివృద్ధికై స్థాపించారు. కాల క్రమేనా ఉన్నత విద్యా స్థాయిలతో అందరికి విద్యను అందిస్తోంది. ఇండియాలో ఒక పెద్ద రీసెర్చ్ సంస్థ గాను, ఆసియ లో బెస్ట్ రీసెర్చ్ సంస్థ గాను పేరు పడింది.