పాతాల్పురి ఆలయం భారతదేశంలో వైదిక కాలం నాటి పురాతన ఆలయాలలో ఒకటి. అందంగా చెక్కిన ఈ భూగర్భ ఆలయం అమరత్వపు చెట్టు, అక్షయవట్ కి దగ్గరగా అలహాబాద్ కోటలో నిర్మించబడింది. ఈ కోట భారత సైన్యంచే ఆక్రమించబడింది, రక్షకదళం మొత్తం ప్రజల కోసం తెరవబడి లేదు.
అయితే, తూర్పు ద్వారం పౌరుల కోసం తెరవబడి ఉంటుంది. ఈ గేటు ద్వారా సందర్శకులు 16 వ శతాబ్దానికి చెందిన అనేక హిందూ దేవీ, దేవతల అందమైన విగ్రహాలను ఈ భూగర్భ ఆలయంలో చూడవచ్చు. హిందువులకు పవిత్రమైన ఈ ఆలయం సంగం కి దగ్గరలో ఉంది. శ్రీరాముడు ఈ ప్రాంతాన్ని సందర్సించాడని హిందూ పౌరాణిక కధనం. ఈ ఆలయాన్ని 5 వ శతాబ్ద౦లో హర్షుల పాలనలో భారతదేశాన్ని చైనీస్ యత్రీకుడు హాన్ సంగ్ సందర్సించినట్లు కూడా పుస్తకాలలో నమోదుచేయబడి ఉంది.