క్రైస్తవుల నమ్మకాన్ని ప్రతిఫలించే ప్రాచీన భవనాలలో చవరన్ భవన్ అనేది అతి ముఖ్యమైనది. ఈ సైరో-మలబార్ కాథలిక్ చర్చ్ లో మొట్టమొదటి కాంగ్రిగేషన్ కి ఆద్యుడు కురియాకోస్ అలియాస్ చవర. అతను నివసించిన భవనం ఇప్పుడు ఒక పవిత్ర దేవాలయంగా గౌరవాన్ని పొందుతున్నది.
దాదాపు మూడు శతాబ్దాల పూర్వం నుంచి ఈ పురాతన క్రైస్తవ భవనం క్రైస్తవులకు తమలోని ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రార్ధనల ద్వారా కనుగొనేందుకు తోడ్పడే స్థానం గా నిలిచింది. ఈ చవరన్ భవన్ కి పడవల ద్వారా మాత్రమే చేరుకోగలరు. ఇది అలెప్పి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆధ్యాత్మిక వెలుగులు చిందే ఈ భవనం మరియు పరిసర ప్రాంతాలు ఏంతో ప్రశాంతత ను పంచుతాయి.
ప్రశాంతమైన, నిర్వికారమైన ఈ ప్రదేశం సమూహం గా ప్రార్ధనలు జరుపుకునేందుకు లేదా ప్రశాంతంగా ఆధ్యాత్మిక ప్రార్ధనలు జరుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశం సాధారణ పర్యాటక ప్రదేశాలకి అతీతంగా హడావిడి లేకుండా ఉంటుంది.