మార్తాండవర్మ బ్రిడ్జి ని ఆధునిక ట్రావెన్ కూర్ వ్యవస్ధాపకుడైన ట్రావెన్ కూర్ రాజు మార్తాండ వర్మ నిర్మించారు. సమీప రాజ్యాలతో వ్యాపారాలు చేయటం కొరకు గాను ఈ బ్రిడ్జిని 1940-42 సంవత్సరాలలో నిర్మించారు. అప్పటినుండి ఇక్కడి ప్రజలకు ఈ బ్రిడ్జి ఎంతో ప్రధానమైనదిగా ఉంది. ఈ బ్రిడ్జిని ఎంతో వ్యూహాత్మకంగా పెరియార్ నదిపై పట్టణం అందంగా కనపడేలా నిర్మించారు.
ఈ బ్రిడ్జి 5.5 కేరేజ్ మార్గం అవటం వలన ఎంతో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. నేటి అధునిక ట్రాఫిక్ అవసరాలకు ఈ బ్రిడ్జి తీర్చలేని కారణంగా అదేమాదిరి బ్రిడ్జిని దానికి సమాంతరంగా మరొకటి కూడా నిర్మాణం చేశారు. కొత్త బ్రిడ్జిని జూన్ 2002లో ప్రారంభోత్సవం చేశారు. ఈ బ్రిడ్జి కారణంగా అలూవాలో చక్కటి పారిశ్రామిక ప్రగతి ఏర్పడింది.