సెమినరీ చర్చిని సెయింట్ జోసెఫ్ పోంటిఫికల్ సెమినరీ, మంగళపూజ అని పిలుస్తారు. ఈ చర్చికి 1964 లో హోలీ సీ వారు పోంటిఫికల్ స్టేటస్ ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సెమినరీలలో ఒక సెమినరీగా పేరు గాంచింది. 1932 నుండి ఇది ఒక క్రిస్టియన్ విద్యా సంస్ధగా కూడా ఉంది.
1996 నుండి ఇది ప్రధాన సైరో - మలబార్ కేధలిక్ చర్చి సెమినరీగా వ్యవహరిస్తోంది. కేరళనుండి ఎవరైనా క్రిస్టియన్ పూజారులుగా అవ్వాలనుకుంటే, వారికి తగిన శిక్షణలనిస్తుంది. ఫిలాసఫీ, ధియాలజీ వంటి వాటిలో డిగ్రీ కోర్సులు, పి హెచ్ డిలు విద్యార్ధులకు అందిస్తోంది. ప్రస్తుతం దీనిలో 7 బ్యాచ్ లు నడుస్తున్నాయి. 263 మంది విద్యార్ధులు కలరు. అరుదైన గ్రంధాలతో ఒక పెద్ద లైబ్రరీ మరియు ప్రశాంతమైన ధ్యాన మందిరం కలిగి అందరిని ఆకర్షిస్తోంది.