ITBPగా పిలవబడే బెంగళూరు అంతర్జాతీయ సాంకేతిక ఉద్యానవనం అసేన్డాస్ సంస్థ నడుపుతున్న ఉన్నత సాంకేతిక ఉద్యానవనం. ITBPలో ఇరవై లక్షల చదరపు అడుగుల్లో 233 కంపెనీలు వున్నాయి. 1998 లో ప్రారంభమైన ఈ ఉద్యానవనం బెంగళూరు నడి బొడ్డు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వుంది.
ITBP లో డిస్కవరర్, ఇన్నోవేటర్, క్రియేటర్, పయోనీర్, వాయేజర్ అని పిలవబడే ఆరు భవనాలు ఉన్నాయి. కేంద్రీకృతం గా నడిచే ఎయిర్ కండిషనర్, లిఫ్టులు, నీటి యాజమాన్యం, మెరుపులు, అగ్ని నుంచి రక్షణ లాంటి సౌకర్యాలతో భవన నిర్వహణ సక్రమంగా వుండేలా చూస్తున్నారు. భారత దేశంలోని ఆరు ప్రముఖ టెలికాం కంపెనీలు ITPB లో స్థలం కొన్నాయి.