యూరోపియన్ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించిన శేషాద్రి మెమోరియల్ హాల్ బెంగళూరు లో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం. 1883 నుంచి 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం మైసూర్ రాష్ట్ర మంత్రిగా పని చేసిన కే.శేషాద్రి అయ్యర్ గారి గుర్తుగా నిర్మించబడింది. ఆయన నిజాయితీకి, సామర్థ్యానికి గౌరవ సూచకంగా బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ భవనాన్ని కట్టించాడు.బెంగళూరు నగరంలోని కేంద్రీయ పరిపాలక ప్రాంతంలోని కబ్బన్ పార్క్ లో శేషాద్రి అయ్యర్ హాల్ ఉంది.ఎరుపు రంగులో తీర్చి దిద్దిన ఈ భవనం ముందు భాగంలో వున్న అందమైన గులాబి తోట దాని సహజ కళాత్మక అంద౦తొ అసూయ గొల్పుతూ వుంటుంది. 830 సంవత్సరం నుంచి 1900 సంవత్సరం దాకా అచ్చైన దాదాపు 2.65 లక్షల పుస్తకాలతో అలరారే గ్రంధాలయం కూడా ఈ భవనం లో వుంది. సోమవారం నాడు మూసి వుండే ఈ గ్రంధాలయంలో బ్రెయిలీ లిపికి చెందిన పుస్తకాలు కూడా చాలా వున్నాయి. మిగిలిన రోజుల్లో ఇది సాధారణంగా ఉదయం 8.30 నుండి సాయంత్రం 7.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.ఈ పురాతన భవనం 300 చదరపు కిలోమీటర్ల స్థల౦ లో విస్తరించి ఉంది. చుట్టూ పచ్చని చెట్లూ చేమల మధ్య వుండే ఈ భవనానికి ఎరుపు రంగు వేయడం దాని అందాన్ని ఇనుమడింప చేస్తుంది. అనేక మంది యాత్రికులను ఆకర్షించే ఈ భవనానికి సంబంధించిన వాస్తవాల్లో ఇది ఒకటి.