మంత్రిది సిద్ధ భైరవి ఆలయం, బెర్హంపూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలోని మంత్రిది అనే చిన్న గ్రామంలో ఉన్న దేవి లేదా శక్తి ఆలయం. ఈ ఆలయ స్థలం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మధ్య సరిహద్దుకి చాలా దగ్గరగా ఉన్న 5 వ నంబరు జాతీయ రహదారిపై ఉంది, రెండు రాష్ట్రాల నుండి వచ్చే నివాశితులకు ఈ ఆలయం సమానమైన అందుబాటులో ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న జగన్నాధుని విగ్రహంతోపాటు ఈ ఆలయంలో అదనంగా 108 విగ్రహాలను జతచేయడానికి అధునాతన నవీకరణలతో అనేక మార్పులు జరిగాయి.
భైరవి దేవత విగ్రహం భూమిదున్నుతున్న రైతు తవ్వకాలలో బైటపడింది. ఈ విగ్రహం తిరిగి చేక్కబడలేదు, కనిపించినపుడు ఉన్నట్లే ఉంది. ఈ ముడి శిల్పం మూడు చేతులు, ఒక కాలు కలిగిన అమ్మవరిలా సూచిస్తుంది. ఈ ఆలయం గడచిన కాలంలో నావికులు, సముద్ర పురుషులు సురక్షిత ప్రయాణం కోరుతూ సందర్శించబడింది. ఈరోజు ఈ ఆలయం దసరా, మహాసప్తమి, సంక్రాంతి, మంగళవారాలలో అధిక సంఖ్యలో భక్తులను చూస్తుంది.