గంగ ఆలయం, భరత్పూర్ లో ప్రసిద్ది చెందిన మందిరం. ఈ ఆలయ నిర్మాణం 1845వ సంవత్సరంలో బల్వంత్ సింగ్ మహారాజు ప్రారంభించారు, అయితే, ఇది పూర్తికావడానికి 90 సంవత్సరాలు పట్టింది. ఆలయ నిర్మాణం పూర్తీ అయిన తరువాత, బల్వంత్ సింగ్ మహారాజు ఐదవ తరానికి చెందిన బ్రిజేంద్ర సింగ్ ఈ ఆలయం లోపల గంగా దేవి విగ్రహం స్థాపించాడు. రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరి నెలసరి జీతాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఈ ఆలయ నిర్మాణం రాజపుత్రుల, మొఘలుల, ద్రవిడుల మిశ్రమ నిర్మాణ శైలిని తెలుపుతుంది. ఈ ఆలయ గోడలు, స్తంభాలూ ఆకర్షణీయమైన, చూడముచ్చటైన చేక్కుల్లతో అలంకరించబడి ఉంటాయి. కృష్ణుడు, లక్ష్మీ నారాయణుడు, శివపార్వతుల విగ్రహాలు ఈ మందిర ప్రధాన ఆకర్షణలు. గంగాసప్తమి, గంగా దసరా పండుగల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.