బుద్గం జిల్లాలో ఉన్న తొసా మైదాన్ కి కొద్ది దూరం లో ఉన్న ప్రసిద్దమైన కొలను సత్ హరన్. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న ఈ కొలను ఇండియా మరియు పీపుల్ స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కి సరిహద్దు అయిన లైన్ అఫ్ అక్చువల్ కంట్రోల్ కి సమీపంలో ఉంది. హిందూ పురాణాల ప్రకారం, హిందువుల దైవం విష్ణు మూర్తి అవతారం అయిన రాముడు తన భార్య సీత అలాగే సోదరుడు లక్ష్మణుడితో ఇక్కడ కొంత కాలం నివసించారు. సీతమ్మవారు ఈ కొలనులో స్నానమాచరించేవారని నమ్ముతారు. అందుకే, ఈ కొలనుకి ఇదివరకు సీతా హరన్ గా పేరు ఉండేది. ఆ తరువాత సత్ హరన్ గా పేరు మారింది.
ఈ కొలను కి దగ్గరగా ఉన్న రాతి మిద సీతమ్మ వారు కూర్చుండేవారని నమ్ముతారు. ఈ కొలనులో ఉన్న నీళ్ళు తియ్యగా ఉంటాయి.