చిత్తౌర్ గర్ రోడ్డు మీద, బుండి నుండి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజోలియా, చౌహాన్ రాజుల పాలనలో కళలకు, వాస్తు శిల్పాలకి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక పీఠభూమిని దాటితే గానీ ఈ పట్టణాన్ని చేరుకోలేనట్లుగా బిజోలియా భౌగోళిక స్థితి ఉంటుంది. శివుని కోసం క్రీ.శ. 13 వ శతాబ్దంలో చౌహాన్ రాజులు బిజోలియాలో మూడు దేవాలయాలు నిర్మించారు. ఈ మందిరాల ప్రదేశంలో ఒక ప్రశాంతమైన జలాశయం ఉంది.