విజయ స్తంభం, చిత్తోర్ ఘడ్ లోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ.క్రీ.శ. 1440 లో మహారాణ కుంభ ఈ స్తంభాన్ని నిర్మించాడు. ఈ కళాత్మక కృతి మోసగాడైన మహమ్మద్ ఖిల్జీ పై ఈ రాజ్యపు విజయానికి చిహ్నం. 37 మీ.ఎత్తైన ఈ స్థంభంలో 9 అంతస్తులు ఉన్నాయి. అందాన్ని ఇనుమడింప చేసే హిందూ దేవతల చిత్రాలు ఈ స్తంభపు గోడలపై ఉన్నాయి. అందాన్ని ఇనుమడింప చేసే హిందూ పురాణగాధలైన రామాయణ, మహాభారత౦ లోని కథలను వర్ణించే చిత్రాలు ఈ స్తంభం పై ఉన్నాయి. ఈ స్థంభం పై నుండి నగరపు అద్భుతమైన దృశ్యాలను పూర్తిగా చూడవచ్చు.