కూర్గ్ లో మల్లాలి జలపాతాలు ఎంతో అందమైనవి. ఇవి కుమార ధార నది నుండి ఆవిర్భవిస్తాయి. ఇవి పుష్పగిరి కొండల పైనుండి సుమారు 62 మీ.ల ఎత్తునుండి పడతాయి. ఈ ప్రదేశం సోంవార్ పేటకు సమీపం. సమీప గ్రామం హంచినహళ్ళి వరకు బస్ సౌకర్యం కలదు. జలపాతాలు చేరాలంటే కాలినడకన మాత్రమే చేరాలి. ఈ జలపాతాలు చూడాలంటే వర్సాకాలం సరైన సమయం. ఈ సమయంలో జలపాతాలూ పూర్తి స్ధాయిలో ప్రవహించి పర్యాటకులకు ఆనందం కలిగిస్తాయి.