పర్యాటకులు గుజరాత్ లో ఉన్నప్పుడు సందర్శించదగ్గ మరో ఆసక్తికరమైన స్థలం మెహ్సానా జిల్లాలోని వాద్నగర్. వాద్నగర్ ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన త్రవ్వకాల్లో క్రీ.శ 2 వ మరియు 7 వ శతాబ్దం మధ్యవి గా భావిస్తున్న బౌద్ధ విహారం మరియు పురాతన బౌద్ధ వస్తువులు కనుగొన్నారు. ఈ మఠంలో రెండు పురావస్తు స్థూపాలు, చుట్టూ తొమ్మిది గదులతో ఉన్న బహిరంగ మండువ ఉన్నాయి.
ఈ గదుల అమరిక స్వస్తిక్ నమూనా ఏర్పాటుతో ఉంటుంది. ప్రస్తుతం వాద్నగర్ పురాతన కాలంలో నిర్మించి మరియు నాశనం అయిన భవనాల పొరల యొక్క అమరిక కారణంగా ఏర్పడిన కృత్రిమ కొండ పై నిలిఛి ఉంది. వాద్నగర్ వద్ద విరామ సమయంలో సందర్శించదగ్గ ముఖ్య ప్రదేశాలలో కొన్ని: హటకేశ్వర్ మహదేవ్ ఆలయం, శర్మిష్ట సరస్సు, జైన్ ఆలయాలు, తానా రీరి తోట మరియు దేరి, గౌరీ కుండ్, ఖోఖ గణపతి, నాగ్ధరో మరియు నాగ్ ఆలయం మరియు నరసింహ మెహతా చోరి.



Click it and Unblock the Notifications