కర్నాటకలోని దట్టమైన అడవులు కల దుబరే ఏనుగుల గుంపులకు ప్రసిద్ధి. సున్నితమైన ఏనుగులతో పర్యాటకులు సన్నిహిత అనుభవాలను పొంది ఆనందించవచ్చు. దుబరే అటవీ సంరక్షణ కావేరి నదీ తీరంలో కూర్గ్ లో కలదు. ఎంతో కాలంనుండి ఈ ప్రదేశం ఏనుగుల శిక్షణాలయంగా చెప్పబడుతోంది. మైసూరు మహారాజుల పాలనా కాలంలో రాజుల ఏనుగులు ఇక్కడ శిక్షణ పొందేవి. ఈ శిక్షణ పొందిన ఏనుగులను దసరా పండుగల వేడుకలలో మైసూర్ మహారాజులు పాల్గొన చేసి ఆనందించేవారు. దుబరే లో వన్య జీవులు
దుబరేలోని దట్టమైన అడవులు ఎన్నో రకాల వన్యజీవులకు అంటే ఏనుగులనుండి, చిన్నపాటి జింకలవరకు ఆశ్రయంగా ఉన్నాయి. చిరుతలు, పులులు, జింకలు, అడవి కుక్కలు మొదలైన జంతువులకు ఈ ప్రాంతం ఒక స్వర్గంలా ఉండి స్వేచ్ఛగా విహరిస్తాయి.
గతంలో అటవీ శాఖ ఏనుగులను కలప రవాణాకు వినియోగించేది. ఇపుడు ఆ ఏనుగులు పర్యాటకులకు ఆనందం కలిగించేవిగా ఉన్నాయి. ఏనుగుల గురించి తెలియచెప్పేందుకు, వినోదం కలిగించేందుకు ప్రభుత్వ అటవీ శాఖ మరియు జంగిల్ లాజస్ అండ్ రిసార్ట్స్ సంస్ధ రెండూ కలిసి ఏనుగుల కేంపులను దుబరేలో నిర్వహిస్తున్నాయి. ఏనుగులు లేకుంటే మన పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది అనే దానిపైనా, మరియు పర్యాటకులు వారి స్వహస్తాలతో ఏనుగులకు ఆహారం అందించటం, వారి స్వంత అనుభవ ఆనందాలను వివరించటం వంటి వివిధ అంశాలపై ప్రభుత్వ అటవీ శాఖ ఏనుగుల జంగిల్ సఫారీలను నిర్వహిస్తోంది.
ఈ అడవిలోని కొండ ప్రాంతం, ట్రెక్కింగ్ మరియు ర్యాఫ్టింగ్ లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అందమైన అనేక ట్రెక్కింగ్ మార్గాలు కలవు. వాటగిలో ఒకటి ఇరుప్పా జలపాతాలకు కూడా దోవ తీస్తుంది.
దుబరే ఒక మంచి విహార స్ధలం. ఎన్నో ఆకర్షణలు, క్రీడలు కలిగి ఉంటుంది. ఇది కొడగు లేదా కూర్గ్ కు సమీపంలో ఉండటంచే తేలికగా అక్కడకు చేరవచ్చు. ఈ ప్రాంతాన్ని బెంగుళూరు మరియు మైసూరుల నుండి కూడా చేరవచ్చు.